జయలలితతోనే అభివృద్ధి సాధ్యమని హాస్య నటుడు సెంథిల్ పేర్కొన్నారు. లోక్సభ అన్నాడీఎంకే అభ్యర్థి హరికి మద్దతుగా గురువారం అరక్కోణంలో ప్రచారం నిర్వహించారు
పళ్లిపట్టు, న్యూస్లైన్: జయలలితతోనే అభివృద్ధి సాధ్యమని హాస్య నటుడు సెంథిల్ పేర్కొన్నారు. లోక్సభ అన్నాడీఎంకే అభ్యర్థి హరికి మద్దతుగా గురువారం అరక్కోణంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జయల లిత అవినీతికి పాల్పడినట్లు డీఎంకే నిర్వాహకు లు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు.
కరుణ కుటుంబసభ్యులు ఏమి చేసి కోట్ల ఆస్తి కూడబెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జయలలితపై నింద మోపి రాజకీయ లబ్ధిపొందాలనే ఆలోచనతో చే స్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దేశంలో సమస్యలు అధికమించి ప్రజాపాలన అందించే సత్తా జయలలితకు మాత్రమే ఉందన్నారు. ప్రజలు అన్నాడీఎంకేను గెలిపించి జయలలితను ప్రధానిమంత్రి చేయాలని కోరారు.