న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. ఢిల్లీ నగరంలోని ఉత్తర ప్రాంతంలో గత నెల రోజులుగా డ్రైవర్ రహిత రైళ్లను ఢిల్లీ మెట్రో పరీక్షిస్తోంది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు.
దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు వచ్చే ఫిబ్రవరి నాటికి రావచ్చు. 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షిస్తున్నాం. ఈ రైళ్లను దక్షిణ కొరియాలో తయారు చేశారు. భారత్లో ఇలాంటి నమూనా రైలునే తయారు చేశారు. బెంగళూరులో తయారు చేసిన ఓ రైలు గత డిసెంబర్లో ఢిల్లీకి చేరుకుంది. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను అందుబాటులో ఉంచుతాం. ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతినిధి అనుజ్ దయాల్ చెప్పారు. ఢిల్లీ మెట్రో సిస్టమ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లు నేరుగా డ్రైవర్ రహిత రైళ్ల గమనాన్ని పర్యవేక్షిస్తాయి. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకుందని, సరాసరి వేగం గంటకు 35 కిలో మీటర్లు ఉంటుందని దయాల్ చెప్పారు.
ఈ రైళ్లను హ్యుందాయ్ రోటెమ్ రూపొందించినట్టు దయాల్ తెలిపారు. 20 కోచ్లను మాత్రమే దక్షిణ కొరియా నుంచి నౌకలో దిగుమతి చేసుకున్నామని, మిగిలిన 366 కోచ్లను (6 కోచ్లు గల 61 రైళ్లు)ను బెంగళూరులో తయారు చేస్తున్నట్టు తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని రూపొందిస్తున్నారు.
డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించిన ఢిల్లీ మెట్రో
Published Wed, Jan 27 2016 2:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement