ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘ఏకకాలంలో రుణమాఫీ చేయాలి’
Nov 15 2016 4:39 PM | Updated on Mar 18 2019 7:55 PM
కడ్తాల్: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విడతల వారీ రుణమాఫీ నిధులు బ్యాంకు వడ్డీలకే నిధులు సరిపోతున్నాయని ఆరోపించారు. ఏకకాలంలో రుణమాఫీతో రైతులను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో మంగళవారం కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కోదండరెడ్డి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ సమస్యలపై రైతుల పక్షాన ఉద్యమించడానికి సిద్దమని ప్రకటించారు.
Advertisement
Advertisement