బీఎన్‌ఎంసీలో కాంగ్రెస్ గెలుపు | BNMC by election Congress wins | Sakshi
Sakshi News home page

బీఎన్‌ఎంసీలో కాంగ్రెస్ గెలుపు

Sep 2 2013 11:21 PM | Updated on Mar 18 2019 7:55 PM

భివండీ నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు.

 భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు వార్డులకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ వార్డులకు ఆదివారం ఉప ఎన్నికలు నిర్వహించగా, సోమవారం ఫలితాలు వెలువడ్డాయి. వార్డు నంబరు-5(ఎ) కాంగ్రెస్ మహిళ కార్పొరేటర్ రెహానా సిద్దిఖీ, వార్డు నంబరు-6 (బి) కార్పొరేటర్ నూరుద్దీన్ అన్సారీ పదవులు రద్దు కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వార్డు నంబరు 5 (ఎ) నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సిద్దిఖీ అంజుమ్‌అహ్మద్ గెలిచారు. 
 
 ఆమెకు 2,237 ఓట్లు పోలవగా ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి షేక్ బద్రున్సీసా ముఖ్తార్‌కు 1,401 ఓట్లు వచ్చాయి. దీంతో అంజుమ్ 836 ఓట్ల అధిక్యంతో గెలిచారు. వార్డు నంబరు-6 (బీ)లో కాంగ్రెస్ అభ్యర్థి అన్సారీ దావుద్ ఇబ్రాహింకు 1,562 ఓట్లు పోలవగా ప్రత్యర్ధి అయిన ఎన్సీపీకి చెందిన అన్సారీ ఔరంగాజేబ్‌కు 994 ఓట్లు వచ్చాయి. దీంతో దావూద్ 568 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement