జీవన్ అమృత్ యోజన (బ్లడ్ ఆన్ కాల్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.
ముంబై: జీవన్ అమృత్ యోజన (బ్లడ్ ఆన్ కాల్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్శెట్టి వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని సాతారా, సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, ఆ రెండు జిల్లాల్లో చక్కని స్పందన లభిందన్నారు. ఈ పథకం అమల్లో భాగంగా పుణేలో ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రక్తం అవసరమైనవారు 104 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. రక్తం అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని బ్లడ్ బ్యాంకులకు ఎప్పటికప్పుడు చేరవేస్తామన్నారు. 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టయితే అత్యవసరమైనవారికి గంటలోగా వాహనాల్లో చేరవేస్తామన్నారు.