‘బ్లడ్ ఆన్ కాల్’ నేటినుంచి అమల్లోకి | 'Blood on Call' scheme to be launched in Maharashtra tomorrow | Sakshi
Sakshi News home page

‘బ్లడ్ ఆన్ కాల్’ నేటినుంచి అమల్లోకి

Jan 6 2014 11:03 PM | Updated on Apr 3 2019 4:22 PM

జీవన్ అమృత్ యోజన (బ్లడ్ ఆన్ కాల్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.

ముంబై: జీవన్ అమృత్ యోజన (బ్లడ్ ఆన్ కాల్) పథకాన్ని  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్‌శెట్టి వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని సాతారా, సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, ఆ రెండు జిల్లాల్లో చక్కని స్పందన లభిందన్నారు. ఈ పథకం అమల్లో భాగంగా పుణేలో ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రక్తం అవసరమైనవారు 104 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. రక్తం అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని బ్లడ్ బ్యాంకులకు ఎప్పటికప్పుడు చేరవేస్తామన్నారు. 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టయితే అత్యవసరమైనవారికి గంటలోగా వాహనాల్లో చేరవేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement