Sakshi News home page

ప్రశ్నాపత్రం లీకేజీపై స్పందించిన మంత్రి

Published Tue, Mar 21 2017 4:22 PM

10th Class english Question Paper Leaked

హైదరాబాద్‌: ఖమ్మంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం రేపింది. ఇంగ్లిష్‌ పరీక్ష ప్రారంభం అయిన కొద్దిసేపటికే ప్రశ్నపత్రం జిరాక్స్‌సెంటర్ల నుంచి బయటకు వచ్చిందని వార్తలు పొక్కాయి. దీనిపై మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఖమ్మం కలెక్టర్‌కు ఫోన్ చేసి పేపర్ లీక్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు. పేపర్ ఎక్కడ లీకయిందో తెలుసుకోవాలని, లీకేజీ అవాస్తమైతే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 

Advertisement
Advertisement