హైదరాబాద్: ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ గాయపడ్డాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా యువీ చేతి వేలికి గాయమైంది. రోహిత్ శర్మ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. వెంటనే అతడు మైదానాన్ని వీడాడు. యువీకి జట్టు ఫిజియో చికిత్స చేశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగి 9 పరుగులు చేశాడు. అయితే గాయం పెద్దది కాదని, మిగతా మ్యాచుల్లో అతడు ఆడే అవకాశముందని తెలుస్తోంది.
34 ఏళ్ల యువీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 234 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో ఆదరగొట్టాడు. 41 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. అయితే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నిన్న ప్రకటించిన భారత జట్టులో యువరాజ్ సింగ్ చోటు సంపాదించాడు.
యువరాజ్ సింగ్కు గాయం
Published Tue, May 9 2017 10:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement