యశ్‌ వర్మకు స్వర్ణం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో సికింద్రాబాద్‌ రైల్వే జూనియర్‌ కాలేజికి చెందిన యశ్‌ వర్మ సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. పురుషుల వ్యక్తిగత 400 మీటర్ల మెడ్లే విభాగంలో స్వర్ణంతో పాటు, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ కేటగిరీలో యశ్‌ కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top