ఆనంద్‌కు రెండో విజయం | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు రెండో విజయం

Published Wed, Feb 18 2015 12:26 AM

viswanathan anand

జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో రెండో విజయం సాధించాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఆనంద్ 41 ఎత్తుల్లో గెలుపొందాడు.
 
 అంతకుముందు ఫాబి యానా కరుఆనా (ఇటలీ)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement