సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్‌ ఆనంద్‌  | Vishwanathan Anand in the US lead | Sakshi
Sakshi News home page

సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ 

Jan 19 2018 1:17 AM | Updated on Jan 19 2018 1:17 AM

Vishwanathan Anand in the US lead - Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఐదు రౌండ్‌లు ముగిశాక భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ 3.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో వీ యి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆనంద్‌తోపాటు అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌) 3.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement