ప్రపంచ టి20 జట్టు కెప్టెన్‌గా ధోని | The T-20 team captain Mahendra Singh Dhoni | Sakshi
Sakshi News home page

ప్రపంచ టి20 జట్టు కెప్టెన్‌గా ధోని

Apr 8 2014 12:59 AM | Updated on Sep 2 2017 5:42 AM

ప్రపంచ టి20 జట్టు  కెప్టెన్‌గా ధోని

ప్రపంచ టి20 జట్టు కెప్టెన్‌గా ధోని

భారత కెప్టెన్ ధోని ప్రపంచ టి20 జట్టు సారథిగా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌లో తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో ప్రదర్శన, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’గా ఈ జట్టును ఎంపిక చేసింది.

భారత్ నుంచి నలుగురికి చోటు
 
దుబాయ్: భారత కెప్టెన్ ధోని ప్రపంచ టి20 జట్టు సారథిగా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌లో తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో ప్రదర్శన, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’గా ఈ జట్టును ఎంపిక చేసింది. ధోని, కోహ్లిలతో సహా భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల నుంచి ఇద్దరు చొప్పన, ఆస్ట్రేలియా, శ్రీలంకల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. డేవిడ్ బూన్ చైర్మన్‌గా గల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది.

 జట్టు వివరాలు: రోహిత్ (భారత్), మైబర్గ్ (నెదర్లాండ్స్), కోహ్లి (భారత్), డుమిని (దక్షిణాఫ్రికా), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), ధోని (భారత్), స్యామీ (వెస్టిండీస్), అశ్విన్ (భారత్), స్టెయిన్ (దక్షిణాఫ్రికా), బద్రీ (వెస్టిండీస్), మలింగ (శ్రీలంక), 12వ ఆటగాడు సాంటొకీ (వెస్టిండీస్).

 మహిళల ప్రపంచ జట్టులో పూనమ్ యాదవ్

 టి0 మహిళల వరల్డ్ టీమ్ ఆఫ్ ద టోర్నీలో భారత్ నుంచి లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ మాత్రమే స్థానం దక్కింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ సారథిగా ఎంపికైన ఈ జట్టులో ఆ దేశానికి చెందిన మొత్తం నలుగురికి చోటు లభించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement