breaking news
Team of the tournament
-
CWC 2023:‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్
వన్డే ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ప్రపంచ టి20 జట్టు కెప్టెన్గా ధోని
భారత్ నుంచి నలుగురికి చోటు దుబాయ్: భారత కెప్టెన్ ధోని ప్రపంచ టి20 జట్టు సారథిగా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్లో తాజాగా ముగిసిన ప్రపంచకప్లో ప్రదర్శన, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’గా ఈ జట్టును ఎంపిక చేసింది. ధోని, కోహ్లిలతో సహా భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ల నుంచి ఇద్దరు చొప్పన, ఆస్ట్రేలియా, శ్రీలంకల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. డేవిడ్ బూన్ చైర్మన్గా గల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. జట్టు వివరాలు: రోహిత్ (భారత్), మైబర్గ్ (నెదర్లాండ్స్), కోహ్లి (భారత్), డుమిని (దక్షిణాఫ్రికా), మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా), ధోని (భారత్), స్యామీ (వెస్టిండీస్), అశ్విన్ (భారత్), స్టెయిన్ (దక్షిణాఫ్రికా), బద్రీ (వెస్టిండీస్), మలింగ (శ్రీలంక), 12వ ఆటగాడు సాంటొకీ (వెస్టిండీస్). మహిళల ప్రపంచ జట్టులో పూనమ్ యాదవ్ టి0 మహిళల వరల్డ్ టీమ్ ఆఫ్ ద టోర్నీలో భారత్ నుంచి లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ మాత్రమే స్థానం దక్కింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ సారథిగా ఎంపికైన ఈ జట్టులో ఆ దేశానికి చెందిన మొత్తం నలుగురికి చోటు లభించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ల నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.