టెన్నిస్ చాంప్స్ కౌశిక్, గుల్రాస్


జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కౌశిక్, గుల్రాస్ బేగం విజేతలుగా నిలిచారు. స్మాష్ 9 టెన్నిస్ అకాడమీ అత్తాపూర్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర అండర్-10 విభాగంలో కౌశిక్ విజయం సాధించగా, అండర్-14 బాలికల విభాగంలో సయ్యద్ గుల్రాస్ బేగం టైటిల్ కైవసం చేసుకుంది.

 

 బుధవారం జరిగిన ఫైనల్లో కౌశిక్ కుమార్ 8-1తోవర్షిత్ కుమార్‌పై గెలుపొందగా, గుల్రాస్ 8-1తో శ్రీజా రెడ్డిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో వర్షిత్ 7-3తో బండి యువరాజ్‌పై గెలువగా, కౌశిక్ 7-3తో ఆయుష్ పవన్‌పై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. గుల్రాస్ 7-5తో శ్రేయపై, శ్రీజ 7-4తో నిఖితపై గెలిచి తుదిపోరుకు సిద్ధపడ్డారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top