ఇండోర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. శనివారం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను ఓవర్నైట్ స్కోరు 493/6వద్దే డిక్లేర్డ్ చేయడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. కాగా, ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే రెండు కీలక వికెట్లను బంగ్లా కోల్పోయింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ముందు 343 పరుగుల ఆధిక్యాన్ని ఉంచి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసి టీమిండియా సవాల్ విసిరింది. అయితే బంగ్లా ఓపెనర్లు ఇమ్రుల్(6), షాద్మన్ ఇస్లామ్(6)లు విఫలమయ్యారు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి ఇమ్రుల్ బౌల్డ్ కాగా, ఇషాంత్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి షాద్మన్ కూడా బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ మూడో రోజే మ్యాచ్ను గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి.(ఇక్కడ చదవండి: ‘సగర్వా’ల్ 243)
చివరి పది సందర్భాలను పరిగణలోకి తీసుకుంటే భారత్లో పర్యటించిన జట్లు తమ తమ రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమయ్యాయి. భారత్లో పర్యాటక జట్ల గత పది రెండో ఇన్నింగ్స్లను పరిశీలిస్తే అవి కనీసం రెండొందల దాటడానికే ఆపసోపాలు పడ్డాయి. పర్యాటక జట్లు తమ రెండో ఇన్నింగ్స్లో తొమ్మిదిసార్లు రెండొందల స్కోరు అధిగమించలేకపోవడం భారత్ ఆధిపత్యానికి నిదర్శనగా కనబడుతోంది. కేవలం ఒకసారి మాత్రమే రెండొందల స్కోరును ఒక పర్యాటక జట్టు అధిగమించింది. ఇక తమ రెండో ఇన్నింగ్స్లో తొమ్మిది సార్లు రెండొందల దాటని సందర్భాల్లో ఎనిమిదిసార్లు ప్రత్యర్థి జట్టును భారత్ ఆలౌట్ చేయడం విశేషం.బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్(243), పుజారా(54), రహానే(86), జడేజా(60 నాటౌట్)లు రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.ఆపై వికెట్ల వేటను కొనసాగిస్తోంది. మరి బంగ్లాదేశ్ను కూడా రెండో ఇన్నింగ్స్లో రెండొందల లోపే భారత్ ఆలౌట్ చేసి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
10కి 9సార్లు 200 స్కోరు దాటలేదు..
Published Sat, Nov 16 2019 10:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement