ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల జట్టు సత్తా చాటింది.
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్లో సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల జట్టు సత్తా చాటింది. కొంపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సెయింట్ ఆన్స్ కళాశాల 25-23, 25-16తో నిజామ్ కాలేజీ జట్టుపై విజయం సాధించింది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 25-16, 25-17తో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీపై గెలిచింది. ఈ టోర్నీలో మొత్తం 18 కళాశాలల జట్లు తలపడ్డాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన ఉత్సవంలో అంతర్జాతీయ వాలీబాల్ ప్లేయర్ స్వప్నా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్టిన్స్ కాలేజి ప్రిన్సిపల్ డయానా డేవిడ్ పాల్గొన్నారు.