విండీస్ విజయలక్ష్యం 123 | srilanka set target of 123 runs for west indies | Sakshi
Sakshi News home page

విండీస్ విజయలక్ష్యం 123

Mar 20 2016 9:07 PM | Updated on Nov 9 2018 6:43 PM

విండీస్ విజయలక్ష్యం 123 - Sakshi

విండీస్ విజయలక్ష్యం 123

వరల్డ్ టీ 20లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

బెంగళూరు: వరల్డ్ టీ 20లో భాగంగా  వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన విండీస్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు దిల్షాన్(12)తొలి వికెట్ గా అవుట్ కాగా, చంఢీమాల్(16) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

 

అనంతరం తిరుమన్నే(5), కపుగదెరా(6) నిరాశపరచడంతో శ్రీలంక జట్టు 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మోస్తరుగా రాణించగా, సిరివర్ధనే(0) డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో లంకేయులు వంద పరుగుల మార్కును చేరడం కూడా అనుమానంగా మారింది. ఆ తరుణంలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు,  1సిక్స్) ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టడంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యూల్ బద్రి మూడు వికెట్లు సాధించగా, డ్వేన్ బ్రేవో కు రెండు, రస్సెల్, బ్రాత్ వైట్ లకు  తలో వికెట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement