సఫారీలను తిప్పేస్తున్నారు! | south africa lose 7th wicket at 177 runs | Sakshi
Sakshi News home page

సఫారీలను తిప్పేస్తున్నారు!

Nov 14 2015 2:23 PM | Updated on Sep 3 2017 12:29 PM

సఫారీలను తిప్పేస్తున్నారు!

సఫారీలను తిప్పేస్తున్నారు!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు.

బెంగళూరు: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో  భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. టీ విరామానికి దక్షిణాఫ్రికా కోల్పోయిన ఏడు వికెట్లలో ఆరు వికెట్లను స్పిన్నర్లు నేలకూల్చి తమ సత్తాను మరోసారి చాటుకున్నారు.   రవీంద్ర జడేజా,  రవి చంద్రన్ అశ్విన్ లు తలో మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్నువిరిచారు.  దీంతో దక్షిణాఫ్రికా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

వందో టెస్టు ఆడుతున్న ఏబీ డివిలియర్స్(85) ఏడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.  జడేజా బౌలింగ్ లో వికెట్ కీపర్ సాహా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో డివిలియర్స్ పెవిలియన్ కు చేరక తప్పలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వేన్ జిల్(10), ఎల్గర్(38),డుమనీ (15), ఆమ్లా (7), డుప్లెసిస్ (0), విలాస్(15)లు నిరాశపరిచారు. భారత పేస్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ కు ఒక వికెట్ లభించింది. టాస్ గెలిచిన భారత్ తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఎనిమిది ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే తడబడింది. ఆ తరువాత ఆమ్లా-ఎల్గర్ లు మరమ్మత్తులు చేపట్టారు. కాగా, 15 ఓవర్ లో ఆమ్లా మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపై డివిలియర్స్ జట్టును ఆదుకునే యత్నం చేశాడు.ఒక పక్క వికెట్లు పడుతున్నా.. డివిలియర్స్ ఒక్కడే నిలదొక్కుకుని హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. 105 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 85 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement