అబ్బా స్మృతి.. సెంచరీ మిస్‌ | Smriti Mandhana Misses Century | Sakshi
Sakshi News home page

అబ్బా స్మృతి.. సెంచరీ మిస్‌

Feb 10 2019 11:21 AM | Updated on Feb 10 2019 11:22 AM

Smriti Mandhana Misses Century - Sakshi

భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన శతకాన్ని

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌ మహిళలతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన శతకాన్ని చేజార్చుకుంది. 62 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 పరుగులు చేసిన మంధాన.. డెవిన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు దాటిగా ఆడుతూ స్మృతి మంధాన మంచి శుభారంభాన్ని అందించింది. ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం వేగం తగ్గించని మంధాన.. 33 బంతుల్లో కెరీర్‌లో 8వ హాఫ్‌ సెంచరీ పూర్తిగా చేసుకుంది. మంచి షాట్లతో అలరించింది. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో భారీ షాట్‌కు ప్రయత్నించి నిరాశగా పెవిలియన్‌ చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement