
షోయబ్ మాలిక్ అజేయ సెంచరీ
ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మూడో వన్డేలో విండీస్పై పాక్ గెలుపు
సిరీస్ 2–1తో కైవసం
గయానా: ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (111 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా... మొహమ్మద్ హఫీజ్ (86 బంతుల్లో 81; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అతనికి అండగా నిలిచాడు.
వీరిద్దరూ నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించారు. హఫీజ్ అవుటయ్యాక వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (24 నాటౌట్)తో కలిసి మాలిక్ ఐదో వికెట్కు అజేయంగా 87 పరుగులు జతచేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 233 పరుగులు చేసింది. హోప్ (71; ఒక ఫోర్, 2 సిక్సర్లు), జేసన్ మొహమ్మద్ (59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. పాక్ బౌలర్లలో ఆమిర్, జునైద్, షాదాబ్ రెండేసి వికెట్లు తీశారు. షోయబ్ మాలిక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.