రేపటి నుంచి సెయిలింగ్‌ శిబిరం | Sailing campaign starts tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సెయిలింగ్‌ శిబిరం

Mar 24 2018 10:26 AM | Updated on Sep 4 2018 5:07 PM

సాక్షి, హైదరాబాద్‌: సెయిలింగ్‌ క్రీడపై ఆసక్తి ఉన్న చిన్నారులకు మంచి అవకాశం. వేసవిలో ఈ క్రీడపై పట్టు పెంచుకునేందుకు వీలుగా ఈఎంఈ సెయిలింగ్‌ ఆసోసియేషన్‌ (ఈఎంఈఎస్‌ఏ) శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఆదివారం నుంచి హుస్సేన్‌సాగర్‌లో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. సెయిలింగ్‌లోని అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోనూ ఏప్రిల్‌ 1 వరకు శిక్షణనిస్తారు. ఆసక్తి గల వారు ఆదివారం ఉదయం 11 గంటలలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని ఈఎంఈ సెయిలింగ్‌ క్లబ్‌ను సందర్శించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement