ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య

Sai Dedeepya in Pre Quarters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) మహిళల టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయి దేదీప్య ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి లేక్‌వ్యూ టెన్నిస్‌ అకాడమీలో మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో దేదీప్య 6–4, 7–6 (7/5)తో రిచా చౌగలేపై విజయం సాధించింది. మొదటి సెట్‌ను సులభంగా గెలిచిన దేదీప్యకు రెండో సెట్‌లో రిచా నుంచి ప్రతిఘటన ఎదురవడంతో టైబ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో సాయి దేదీప్య పైచేయి సాధించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top