రోహిత్‌ శర్మ పునరాగమనం | Rohit Sharma looking to make comeback in South Africa | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ పునరాగమనం

Jul 10 2017 1:55 AM | Updated on Sep 5 2017 3:38 PM

రోహిత్‌ శర్మ పునరాగమనం

రోహిత్‌ శర్మ పునరాగమనం

శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం సెలక్టర్లు ఆదివారం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు.

ముంబై: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం సెలక్టర్లు ఆదివారం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో ఇం డోర్‌లో ఆఖరి సారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన అతను... ఆ తర్వాత గాయం కారణంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో సీనియర్‌ టీమ్‌ నుంచి కరుణ్‌ నాయర్‌ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్‌ కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, అశ్విన్, జడేజా, సాహా, ఇషాంత్, ఉమేశ్, పాండ్యా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, ముకుంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement