షమీ అవుట్‌.. హర్షల్‌ ఇన్‌

RCB won the toss elected to field first - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ చిన్నస‍్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ముందుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను  బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ తుది జట్టులో గుజరాత్‌ మీడియం పేసర్‌ హర్షల్‌ పటేల్‌కు చోటు దక్కింది. పేసర్‌ మహ్మద్‌ షమీ స్థానంలో హర్షల్‌ను తీసుకున్నారు. ఇక ఆర్సీబీ జట్టులో సర్సరాజ్‌ ఖాన్‌కు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో మనన్‌ వోహ్రాకు అవకాశం కల్పించారు.   

ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా తలో మ్యాచ్‌లో మాత్రమే గెలిచాయి. దాంతో ఈ టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప‍్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఎనిమిదో స్థానంలో ఉంది.

తుది జట్లు

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

గౌతం గంభీర్‌(కెప్టెన్‌), జాసన్‌ రాయ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రాహుల్‌ తెవాతియా, విజయ్‌ శంకర్‌, క్రిస్‌ మోరిస్‌, షహబాజ్‌ నదీమ్‌, హర్షల్‌ పటేల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

ఆర్సీబీ

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), డీ కాక్‌, మనన్‌ వోహ్రా, ఏబీ డివిలియర్స్‌, మన్‌దీప్‌ సింగ్‌, కోరీ అండర్సన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రిస్‌ వోక్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, మొహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చాహల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top