రంగారెడ్డి ఖో–ఖో జట్ల డబుల్‌ ధమాకా | rangareddy kho kho teams won titles | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి ఖో–ఖో జట్ల డబుల్‌ ధమాకా

Sep 30 2017 10:40 AM | Updated on Sep 30 2017 10:40 AM

rangareddy kho kho teams won titles

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) అండర్‌–19 ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జట్లు డబుల్‌ ధమాకా సాధించాయి. బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. సరూర్‌ నగర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 10–6తో వరంగల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 12–6తో ఆదిలాబాద్‌పై, వరంగల్‌ జట్టు 6–4తో ఖమ్మంపై గెలుపొందాయి.

బాలికల తుదిపోరులో రంగారెడ్డి 4–2తో మహబూబ్‌నగర్‌ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో రంగారెడ్డి అమ్మాయిలు 6–2తో కరీంనగర్‌ జట్టుపై, మహబూబ్‌నగర్‌ 8–3తో వరంగల్‌పై విజయం సాధించాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు బాలబాలికల జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement