రాకేశ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ తైక్వాండో చాంపియన్షిప్లో హైదరాబాద్ ప్లేయర్ బొన్మన్ రాకేశ్ రెండు పతకాలు సాధించాడు. లక్నోలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో రాకేశ్ –74 కేజీల విభాగంలో కాంస్యం... పోమ్సె డెమో ఈవెంట్లో రజతం సాధించాడు. ఈ రెండు పతకాలతోపాటు రాకేశ్కు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. భారత తైక్వాండో సమాఖ్య సెక్రటరీ జనరల్ జిమ్మీ జగ్తియాని, కోశాధికారి సుధీర్, తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు బాలరాజు చేతుల మీదుగా రాకేశ్ పతకాలను అందుకున్నాడు.
మరిన్ని వార్తలు