మూడో రోజూ వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘గ్రీన్’... ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్ను వర్షం వదలడం లేదు. మ్యాచ్ మూడో రోజూ గురువారం వాన కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. వర్షంవల్ల రెండో రోజు ఆట కూడా పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే.
తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు 177 పరుగులకే ఆలౌట్ కాగా... ఇండియా ‘గ్రీన్’ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే.