పంజాబ్ పట్టు అదుర్స్ | Punjab hold Adhurs | Sakshi
Sakshi News home page

పంజాబ్ పట్టు అదుర్స్

Dec 14 2015 2:17 AM | Updated on Aug 25 2018 5:10 PM

ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో పంజాబ్ రాయల్స్ పట్టు ముందు యూపీ వారియర్స్ తేలిపోయింది.

యూపీపై 6-1తో విజయం
 
లూథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో పంజాబ్ రాయల్స్ పట్టు ముందు యూపీ వారియర్స్ తేలిపోయింది. ఆదివారం జరిగిన ఈ పోరులో పంజాబ్ 6-1తో ఘనవిజయాన్ని అందుకుంది. పురుషుల 65 కేజీ విభాగంలో రజనీశ్ 8-5తో గంజోరిగ్‌పై నెగ్గి పంజాబ్‌కు శుభారంభాన్నిచ్చాడు. 97 కేజీ విభాగంలో మౌసమ్ ఖత్రి 5-0తో సత్యవ్రత్ కడియాన్‌పై గెలిచాడు. మహిళల 53 కేజీ విభాగంలో బబితా కుమారి 6-4తో ప్రియాంక ఫోగట్‌ను ఓడించి యూపీ వారియర్స్‌కు ఏకైక విజయాన్ని అందించింది.

ఆ తర్వాత ప్రవీణ్ రాణా (74 కేజీలు) 4-4తో పూరెవ్‌జావ్‌ను... గీతా ఫోగట్ (58 కేజీలు) 3-2తో సరితాను.. వసీలిసా (69 కేజీలు) 2-1తో అలీనాను.. జర్గల్ సైఖాన్ (125 కేజీలు) 10-0తో జోగిందర్ కుమార్‌ను చిత్తుగా ఓడించి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. సోమవారం జరిగే మ్యాచ్ లో ముంబై గరుడ జట్టుతో బెంగళూరు యోధాస్ జట్టు తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement