యూపీ యోధపై యు ముంబా గెలుపు | Pro Kabaddi League U Mumba Beat UP Yoddha | Sakshi
Sakshi News home page

యూపీ యోధపై యు ముంబా గెలుపు

Sep 19 2019 2:45 AM | Updated on Sep 19 2019 2:45 AM

Pro Kabaddi League U Mumba Beat UP Yoddha  - Sakshi

పుణే: అభిషేక్ సింగ్ (11 రైడ్‌ పాయింట్లు) చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం యూపీ యోధపై మాజీ చాంపియన్‌ యు ముంబా 39–36 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభంలో యూపీ ఆధిపత్యం చూపినా ముంబై తేరుకుని మొదటి భాగాన్ని 16–15తో ముగించింది. రెండో భాగమూ పోటాపోటీగానే సాగింది. ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అభిõÙక్‌ మూడు రైడ్‌ పాయింట్లతో ఫలితాన్ని మలుపు తిప్పాడు. పుణేరి పల్టన్‌–తమిళ్‌ తలైవాస్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 36–36తో ‘డ్రా’గా ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement