దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రీతి జింటా | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రీతి జింటా

Published Sat, Sep 9 2017 1:29 AM

దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రీతి జింటా

జట్టును కొన్న కింగ్స్‌ ఎలెవన్‌ యజమాని

పార్ల్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అత్యంత పేలవం. అయినా సరే దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు నిర్వహించనున్న గ్లోబల్‌ టి20 లీగ్‌లో కూడా ప్రీతి జింటా  అడుగుపెట్టింది. ‘స్టెలెన్‌బాష్‌’ టీమ్‌ను కొనుగోలు చేసింది. 

కొన్నాళ్ల క్రితం జట్లను వేర్వేరు కంపెనీలు సొంతం చేసుకున్న సమయంలో స్టెలెన్‌బాష్‌ను దక్షిణాఫ్రికాకే చెందిన బ్రిమ్‌స్టోన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కొనుక్కుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలతో బ్రిమ్‌స్టోన్‌ తాము లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా...ఆ స్థానంలో ఇప్పుడు ప్రీతి జింటా వచ్చింది.

Advertisement
Advertisement