పారాలింపియన్ కు అవమానం | Paralympian Aditya Mehta forced to take off prosthetic limb at Bengaluru airport | Sakshi
Sakshi News home page

పారాలింపియన్ కు అవమానం

Oct 13 2016 8:24 AM | Updated on Oct 2 2018 8:44 PM

పారాలింపియన్ కు అవమానం - Sakshi

పారాలింపియన్ కు అవమానం

పారాలింపియన్ ఆదిత్యా మెహతాకు అవమానం జరిగింది.

బెంగళూరు: పారాలింపియన్ ఆదిత్యా మెహతాకు అవమానం జరిగింది. ఈ నెల 11వ తేదీన బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)కు నుంచి హైదరాబాద్ బయల్దేరిన తనతో అధికారులు తప్పుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఆసియన్ పారా-సైక్లింగ్ చాంపియన్ షిప్-2013లో ఆదిత్యా మెహతా రెండు వెండి పతకాలు సాధించారు.
 
తన కృత్రిమ కాలును భద్రతా కారణాల రీత్యా పరిశీలించాలని చెప్పిన సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ తర్వాత బలవంతంగా బట్టలు తీయించి తనను చూసి నవ్వుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రయాణానికి అనుమతించినట్లు తెలిపారు. తనను ట్రీట్ చేస్తున్న విధానంపై అధికారులను ప్రశ్నించగా వారు అవేమీ పట్టించుకోలేదని అన్నారు.
 
ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ సీఐఎస్ఎఫ్ అధికారి పేరును చెబుతూ ఆయన తీవ్రంగా స్పందించారు. దివ్యాంగులను చెక్ చేసేందుకు డీజీసీఏ ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని లేఖ రాసినట్లు చెప్పారు. రెండు నెలల క్రితం కూడా ఓ ఎయిర్ పోర్టులో ఆదిత్యా మెహతా కృత్రిమ కాలును పరిశీలించారు. కాగా, కృత్రిమ అవయవాలను పరిశీలించడం చెకింగ్ లో భాగమని హైదరాబాద్ లోని డీజీసీఏ కార్యాలయం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement