పాక్‌ను గెలిపించిన షోయబ్‌ మాలిక్‌ | Pakistan Beat Bangladesh By 5 Wickets In 1st T20 | Sakshi
Sakshi News home page

పాక్‌ను గెలిపించిన షోయబ్‌ మాలిక్‌

Jan 25 2020 5:08 AM | Updated on Jan 25 2020 5:08 AM

Pakistan Beat Bangladesh By 5 Wickets In 1st T20 - Sakshi

లాహోర్‌: అంతర్జాతీయ టి20ల్లో ఎదురవుతోన్న వరుస పరాజయాలకు పాకిస్తాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (39; 4 ఫోర్లు, సిక్స్‌), మొహమ్మద్‌ నైమ్‌ (43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

పునరాగమనంలో తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ (45 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మాలిక్‌ చివరి టి20ని 2019 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పాకిస్తాన్‌ తరఫున హసన్‌ అలీ, హరీస్‌ రౌఫ్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఇక్కడే నేడు జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement