ఉస్మానియా ‘డబుల్’ | Osmania doubles | Sakshi
Sakshi News home page

ఉస్మానియా ‘డబుల్’

Oct 15 2013 11:45 PM | Updated on Sep 1 2017 11:40 PM

సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు రాణించాయి. మహిళల బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచాయి.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లు రాణించాయి. మహిళల బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచాయి. పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ టైటిల్ ను హైదరాబాద్‌కు చెందిన జేఎన్‌టీయూ జట్టు గెలుచుకుంది. ఒడిషాలోని కేఐటీ యూనివర్సిటీలో ఈనెల 7 నుంచి 12 వరకు ఈ పోటీలు జరిగాయి. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగం ఫైనల్లో ఓయూ 2-1తో డీఏవీ ఇండోర్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్ మ్యాచ్‌లో పూజా (ఓయూ) 19-21, 11-21స్కోరుతో నజ్మా ఖాన్ (డీఏవీ) చేతిలో ఓడిపోయింది.

 
 డబుల్స్‌లో లీలా లక్ష్మీ, జమున రాణి జోడి(ఓయూ) 21-13, 21-14తో షాజియా ఖాన్, నజ్మా ఖాన్ జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో సి.హెచ్.పూర్ణిమ (ఓయూ) 22-20, 18-21, 21-14తో షాజియా ఖాన్‌పై నెగ్గింది. పురుషుల టీమ్ విభాగం ఫైనల్లో హైదరాబాద్ జేఎన్‌టీయూ 3-1తో ఓయూపై గెలిచింది. ఫైనల్లో  తొలి సింగిల్స్‌లో విశాల్ రెడ్డి (జేఎన్‌టీయూ) 18-21, 17-21తో కిరణ్ మౌళి (ఓయూ)పై గెలిచాడు.  రెండో సింగిల్స్ ఎన్.వి.ఎస్.విజేత (జేఎన్‌టీయూ) 21-12, 21-16తో అర్జున్ రెడ్డి(ఓయూ)పై గెలిచాడు.

 
 డబుల్స్‌లో విజేత, సంతోష్ జోడి (జేఎన్‌టీయూ) 21-13, 21-19తో ఆదిత్య, పూర్ణేందు జోడి(ఓయూ)పై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో జయసింహారెడ్డి (జేఎన్‌టీయూ) 21-12, 21-13తో వేణుమాధవ్ (ఓయూ)పై నెగ్గాడు. వాలీవాల్ మహిళల విభాగం ఫైనల్లో ఓయూ జట్టు 25-14, 25-22, 25-17 స్కోరుతో ఎల్‌ఎన్‌ఐపీఈ (గ్వాలియర్)పై ఘన విజయం సాధించి సంచలనం సృషించింది. ఓయూ జట్టులో ప్రియా, శాంతి,  సౌమ్యాలు చక్కటి ఆటతీరు ప్రదర్శించి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement