భారత్తో క్రికెట్ సిరీస్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తేల్చి చెప్పారు.
పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్
కరాచీ: భారత్తో క్రికెట్ సిరీస్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొందని గుర్తుచేశారు. ‘ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ జరగాలంటే అంతకన్నా ముందు ఇతర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. నాకైతే ఇప్పట్లో మ్యాచ్లు జరుగుతాయని అనిపించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తి వివరాలు పీసీబీ చెప్పాల్సి ఉంటుంది’ అని అజీజ్ తెలిపారు.