గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు | Narine And Pollard named in West Indies squad for India T20Is | Sakshi
Sakshi News home page

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

Jul 23 2019 10:53 AM | Updated on Jul 23 2019 10:56 AM

Narine And Pollard named in West Indies squad for India T20Is - Sakshi

ఆంటిగ్వా: వచ్చే నెల తొలి వారంలో టీమిండియాతో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్‌ జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన విండీస్‌ జట్టును సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు.  ఇందులో కీరోన్‌ పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌లకు చోటు కల్పిస్తూ విండీస్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండేళ్ల క్రితం చివరిసారి టీ20 ఆడిన నరైన్‌.. ఎట్టకేలకు తిరిగి చోటు దక్కించుకున్నాడు.

కాగా, టీ20 స్సెషలిస్టు క్రిస్‌ గేల్‌ మాత్రం టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌ కారణంగా గేల్‌ అందుబాటులో ఉండటం లేదని విండీస్‌ బోర్డు స్పష్టం చేసింది. కాగా, వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ ఆంథోని బ్రాంబెల్‌ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకూ 12 టీ20 మ్యాచ్‌లతో పాటు 46 లిస్ట్‌-ఏ గేమ్‌లు ఆడిన బ్రాంబెల్‌కు అవకాశం కల్పించారు. అదే సమయంలో మూడు అంతర్జాతీయ టీ20లు ఆడిన  ఖారీ పైర్రేతో పాటు జాన్‌ క్యాంప్‌బెల్‌కు చోటు దక్కింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఉన్న తరుణంలో  ఇప్పట్నుంచే జట్టును సమతూకంలో ఉంచాలనే భావించే యువకులకు అవకాశం కల్పిస్తున్నామని సెలక్షన్‌ కమిటీ తాత్కాలిక చైర్మన్‌ రాబర్ట్‌ హేన్స్‌ తెలిపారు.(ఇక్కడ చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే)

భారత్‌తో తొలి టీ20లకు విండీస్‌ జట్టు ఇదే..

కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(కెప్టెన్‌), జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, కీరోన్‌ పొలార్డ్‌, రావ్‌మాన్‌ పావెల్‌, కీమో పాల్‌, సునీల్‌ నరైన్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, ఓష్నీ థామస్‌, ఆంథోని బ్రాంబెల్‌, ఆండ్రీ రసెల్‌, ఖారీ పైర్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement