ధోని సరికొత్త రికార్డు | Mahendra Singh Dhoni becomes the first Indian cricketer to hit 200 sixes in ODIs | Sakshi
Sakshi News home page

ధోని సరికొత్త రికార్డు

Jan 19 2017 5:21 PM | Updated on Sep 5 2017 1:37 AM

ధోని సరికొత్త రికార్డు

ధోని సరికొత్త రికార్డు

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోని మరో ఘనత సాధించాడు.

కటక్: టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోని మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న మహి తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు.

కటక్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో అతడు 200 సిక్సర్ల మైలు రాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో 10వ సెంచరీ సాధించి ‘మిస్టర్ కూల్’  సత్తా చాటాడు. 122 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్లతో 134 పరుగులు సాధించాడు. స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా ధోని దక్కించుకున్నాడు. సచిన్ తర్వాత స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా ధోని నిలిచాడు.


వన్డేల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్లు
షాహిద్‌ ఆఫ్రిది- 350
సనత్ జయసూర్య-270
క్రిస్ గేల్- 238
ఎంఎస్ ధోని -203
బ్రెండన్ మెక్ కల్లమ్-200
సచిన్ టెండూల్కర్ -195
సౌరవ్ గంగూలీ-190

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement