భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్ఎల్టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు.
పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్ఎల్టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు. భారత గడ్డపై ఓ ఏటీపీ చాలెంజర్ ఈవెంట్లో పాల్గొనడం 19 ఏళ్ల అనంతరం పేస్కిదే తొలిసారి కావడం గమనార్హం.