క్వార్టర్స్‌లో కశ్యప్‌ | Kasyap enters quarters of austrian open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో కశ్యప్‌

Feb 24 2018 10:55 AM | Updated on Sep 4 2018 5:07 PM

Kasyap enters quarters of austrian open - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం వియన్నాలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కశ్యప్‌ 21–15, 22–20తో జియా వె తాన్‌ (మలేసియా)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ 17–21, 9–21తో విక్టర్‌ స్వెండ్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ అమ్మాయి ఇరా శర్మ 16–21, 13–21తో జు వీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.

స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరుగుతున్న స్విస్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో గురుసాయిదత్‌ 8–21, 15–21తో కాంతాపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement