శ్యామ్‌ కుమార్‌కు పతకం ఖాయం | kakara shyam kumar quarter final jakarta boxing tournaments | Sakshi
Sakshi News home page

శ్యామ్‌ కుమార్‌కు పతకం ఖాయం

Feb 12 2018 4:56 AM | Updated on Feb 12 2018 4:56 AM

kakara shyam kumar quarter final jakarta boxing tournaments - Sakshi

కాకర శ్యామ్‌ కుమార్‌

ఆసియా క్రీడల టెస్ట్‌ ఈవెంట్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో వైజాగ్‌ బాక్సర్‌ శ్యామ్‌ 3–2తో సహెన్‌ సమిక్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత్‌కే చెందిన శశి చోప్రా (57 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement