ఐపీఎల్-7: పంజాబ్ జోరు.. ఢిల్లీ ఓటమి | IPL-7: Punjab beats Delhi | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: పంజాబ్ జోరు.. ఢిల్లీ ఓటమి

May 19 2014 11:32 PM | Updated on Sep 2 2017 7:34 AM

ఐపీఎల్ ఏడో అంచెలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది.

ఢిల్లీ: ఐపీఎల్ ఏడో అంచెలో కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పంజాబ్ నాలుగు వికెట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్పై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగా ఆరు వికెట్లకు విజయతీరాలకు చేరింది. ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్ (23), మనన్ వోహ్రా (42) రాణించారు. కాగా సూపర్ ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ 14 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో అక్షర్ పటేల్ (42 నాటౌట్) రాణించి జట్టును గెలిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ మురళీ విజయ్ 5 పరుగులకే వెనుదిరిగినా మరో ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (49) రాణించాడు. దినేష్ కార్తీక్ (69) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు డుమినీ 17 పరుగులు చేశాడు. కాగా ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేక్ వేశారు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ, హెండ్రిక్స్ మూడేసి వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement