ప్రసాద్‌కు స్వర్ణం | gold medal for prasad | Sakshi
Sakshi News home page

ప్రసాద్‌కు స్వర్ణం

Jan 15 2015 12:42 AM | Updated on Sep 2 2017 7:43 PM

ప్రసాద్‌కు స్వర్ణం

ప్రసాద్‌కు స్వర్ణం

కొత్తగా ఏర్పడిన ‘బాక్సింగ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎలైట్ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పీఎల్)...

జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్

నాగ్‌పూర్: కొత్తగా ఏర్పడిన ‘బాక్సింగ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎలైట్ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పీఎల్) స్వర్ణ పతకాన్ని సాధించాడు. బుధవారం ముగిసిన ఈ పోటీల్లో వైజాగ్‌కు చెందిన ప్రసాద్... కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు.

లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) విభాగంలో పోటీపడిన ప్రసాద్ ఫైనల్లో రైల్వేస్‌కు చెందిన సల్మాన్ షేక్‌ను ఓడించి తొలిసారి సీనియర్ చాంపియన్‌గా అవతరించాడు. దాంతోపాటు ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్‌ఐ)లో శిక్షణ పొందిన ప్రసాద్ 2012లో ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో, 2013 ఆసియా యూత్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకాలు గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement