పంజాబ్ కింగ్స్ విజయలక్ష్యం 116


మొహాలీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు.


 


అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న పంజాబ్.. ప్లే ఆఫ్ దశలో రెండో స్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.


 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top