ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు భారత హాకీ జట్టు ప్రయత్నిస్తోంది.
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ
లండన్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు భారత హాకీ జట్టు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పతకం సాధించాలనే ఉద్దేశంతో ఉంది. జర్మనీతో జరిగే ప్రారంభ మ్యాచ్లో భారత్ తలపడుతుంది.
1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం సాధించిన అనంతరం భారత జట్టు ఇప్పటిదాకా పోడియం దక్కించుకోలేకపోయింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, బెల్జియం, దక్షిణ కొరియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.