చాంపియన్ లీగ్ టి20 ను బీసీసీఐ రద్దు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
ముంబై: చాంపియన్స్ లీగ్ టి20 ను బీసీసీఐ రద్దు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ టోర్నీని నిర్వహించడం కష్టమని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో దీన్ని రద్దు చేసింది.
సీఎల్ టి20 స్థానంలో ఐపీఎల్లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్లాంటిది నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బేబీ ఐపీఎల్ పేరుతో టోర్నీ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.