భారత్ ఎదుట భారీ లక్ష్యం | bangladesh set 308 target to india | Sakshi
Sakshi News home page

భారత్ ఎదుట భారీ లక్ష్యం

Jun 18 2015 7:01 PM | Updated on Sep 3 2017 3:57 AM

భారత్ ఎదుట భారీ లక్ష్యం

భారత్ ఎదుట భారీ లక్ష్యం

భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ఎదుట 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు.

మిర్పూర్: భారత్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించారు. దీంతో భారత్ ఎదుట 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్లు ధాటిగా ఆడి తొలి వికెట్కి 102 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో సర్కార్, తమీమ్ ఇక్బాల్లు వేగంగా ఆడి జట్టు స్కోరుని పరుగులు పెట్టించారు. సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది.

తిరిగి మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు(62 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్) చేసి అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వెనువెంటనే వికెట్లు కోల్పోయిన బంగ్లాను షకీబ్, రహమాన్లు బాధ్యతాయుతంగా ఆడి తిరిగి గాడిలో పెట్టారు. రహమాన్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. షకీబ్(52) పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో నాసిర్ హొస్సేన్(34) భారీషాట్కి యత్నించి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించి వెనువెంటనే ఔటయ్యారు. దీంతో బంగ్లా 49.4 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement