మ్యాచ్‌కు టిమ్ కుక్ | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కు టిమ్ కుక్

Published Fri, May 20 2016 12:11 AM

మ్యాచ్‌కు టిమ్ కుక్

కాన్పూర్: ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన జీవితంలో తొలి సారి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌లో ఉన్న కుక్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఆహ్వానం మేరకు స్టేడియానికి వచ్చి గుజరాత్, కోల్‌కతా మ్యాచ్‌ను తిలకించారు. ‘చాలా అద్భుతంగా ఉంది. నాకు తెగ నచ్చేసింది. ఇంత వేడిలో మ్యాచ్ చూడటం అంత సులువు కాకపోయినా నాకు ఇదో కొత్త అనుభూతి. క్రికెట్ ఏమిటో, క్రీడల ప్రాధాన్యత ఏమిటో ఇక్కడ కనిపించింది’ అని కుక్ ఆనందపడ్డారు.

Advertisement
Advertisement