గోవాపై ఆంధ్ర గెలుపు | Andhra conquest of Goa | Sakshi
Sakshi News home page

గోవాపై ఆంధ్ర గెలుపు

Jan 31 2017 12:26 AM | Updated on Aug 18 2018 5:57 PM

గోవాపై ఆంధ్ర గెలుపు - Sakshi

గోవాపై ఆంధ్ర గెలుపు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది.

చెన్నై: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఓపెనర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన గోవా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్వప్నిల్‌ అస్నోడ్కర్‌ (54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు.

అయ్యప్ప, స్టీఫెన్, షోయబ్, భార్గవ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అశ్విన్‌ వీరోచిత ప్రదర్శనతో ఆంధ్ర 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవితేజ 32 పరుగులు చేశాడు. తమిళనాడుతో జరిగిన మరో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 72 పరుగుల తేడాతో గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement