ఆ కల ఇంకా తాజాగానే ఉంది: అం‍బటి రాయుడు | Ambati Rayudu to undergo Yo Yo Test once again after failing the first time | Sakshi
Sakshi News home page

ఆ కల ఇంకా తాజాగానే ఉంది: అం‍బటి రాయుడు

Jul 5 2018 11:47 AM | Updated on Jul 5 2018 12:59 PM

Ambati Rayudu to undergo Yo Yo Test once again after failing the first time - Sakshi

బెంగళూరు: ఐపీఎల్ 2018 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేసిన అంబటి రాయుడు.. యో-యో టెస్టులో ఫెయిల్‌ కావడంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రాయుడు 16 మ్యాచ్‌లకు గాను మొత్తం 602 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఈ ప్రదర్శనని పరిగణలోకి తీసుకున్న భారత సెలక్టర్లు ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానంలో కల్పించారు.

కానీ.. ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి ముందు బెంగళూరులో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో రాయుడు ఫెయిలయ్యాడు. దీంతో జట్టు నుంచి అతడ్ని తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. యో-యో టెస్టు ఫెయిలైన తర్వాత మీడియాకి దూరంగా ఉన్న అంబటి రాయుడు తాజాగా మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. ‘భారత జట్టుకు మళ్లీ ఆడాలనే ఆశని నేను వదులుకోలేదు. ఆ కల ఇంకా తాజాగానే ఉంది. ప్రస్తుతం నా ఆటకి మెరుగులు దిద్దుకుంటున్నా. త్వరలోనే మళ్లీ యో-యో ఫిట్‌నెస్ టెస్టుకి హాజరవుతా. కచ్చితంగా పాసవుతాననే నమ్మకం ఉంది. టీమిండియాకు ఆడాలనే నా లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉన్నా. అదే నన్ను నడిపిస్తుంది’ అని రాయుడు పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement