ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న.. | YSRCP MP Vijaya Sai Reddy Tweet On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడేది ఎవరో? 19న తెలుస్తుంది..

Jun 12 2020 9:18 AM | Updated on Jun 12 2020 9:23 AM

YSRCP MP Vijaya Sai Reddy Tweet On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక  ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని ట్వీట్‌ చేశారు. (నీచ స్థాయికి ఎల్లోమీడియా..)

Advertisement
 
Advertisement
Advertisement