
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
పకాశం, రామాయపాలెం (పెద్దారవీడు): వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాలు అందరి జీవీతాల్లో వెలుగులు నింపుతాయని నియోజకవర్గ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిబూలపు సురేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంచారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే సువర్ణ పరిపాలన, రాజన్న రాజ్యం వస్తుందన్నారు. రైతు భరోసా కింద రూ. 12,500 పంట పెట్టుబడి, ఉచిత బోర్లు, వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ బ్యాంకులో డబ్బులు వేస్తారని, ఇల్లు లేని లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఆ ఇంటి మహిళ పేరిట రిజస్ట్రేషన్ చేయిస్తారని, 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకు రూ. 2 వేలు చెల్లిస్తారని, డ్వాక్రా సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు 4 దఫాలుగా చేతికే అందిస్తామని తెలిపారు.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలునిచ్చారు. మట్టి ఇసుక, మద్యపానంలో అవినీతిగా సంపాదించిన డబ్బులు టీడీపీ నాయకుల ఇళ్లలో నుంచి బయట పడుతుందన్నారు. పింఛన్, సబ్సిడీ రుణాలు, బోర్లు, సంక్షేమ పథకాలకు టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చస్తున్నారని, టీడీపీ మద్దతు పలికిన వారికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యువకులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి, జెడ్పీటీసీ దుగ్గెంపుడి వెంకటరెడ్డి, మాజీ సర్పంచులు బొచ్చు సుబ్బారెడ్డి, మోటకట్ల అక్కిరెడ్డి, దుద్దెల వెంకటరెడ్డి, మూల లక్ష్మీరెడ్డి, రామకృష్ణారెడ్డి, అల్లు పెద్ద అంకిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు తమ్మిశెట్టి తిమ్మరాజు, మండల నాయకులు పొందుగుల వెంకటరెడ్డి, మూల రమణారెడ్డి, షేక్ బుజ్జీ, గాలి రమణారెడ్డి, మూల సత్యంరెడ్డి, మూల శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, కందుల రమణారెడ్డి, రంగారెడ్డి, పలు విభాగాల నాయకులు వజ్రాల ఆదిరెడ్డి, కాసు వెంకటరెడ్డి, ఒద్దుల లక్ష్మిరెడ్డి, సొంటి నాగర్జునరెడ్డి, బీసీ నాయకులు రామచంద్రుడు, సాయిక్రిష్ణ, ఏర్వ సహదేవుడు, వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య, తోకల ఆవులయ్య, అమృతపుడి కోటేష్, రమణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కందుల కాశిరెడ్డి, ఆచారి పాల్గొన్నారు.