నా హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం

YS Jagan Deeply Mourn Demise Of DA Somayajulu - Sakshi

డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు డీఏ సోమయాజులు మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను సదా స్మరించుకుంటానని అన్నారు. తనకు ఆయన అందించిన మార్గదర్శకత్వం, మద్దతును ఎల్లవేళలా కాపాడుకుంటానని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

తన హృదయంలో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నారు. సోమయాజులు కుటుంబ సభ్యులకు, ఆయనను ప్రేమించే వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

కాగా, డీఏ సోమయాజులు మరణించారని తెలియగానే పశ్చిమగోదావరి జిల్లా నుంచి హుటాహుటిన వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమయాజులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top